హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంకతో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవల్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో ఏంజిలో మాథ్యూస్ 95 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, ఆ తర్వాత అవిష్క గుణవర్ధనే 70 పరుగులతో రాణించాడు.
అనంతరం 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే వార్నర్ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి ఆరోన్ ఫించ్ (137) సెంచరీతో చెలరేగాడు. చివర్లో ట్రావెస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులతో రాణించాడు.
దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 49.4 ఓవర్లలో 319 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది.