ఐసీసీ టోర్నీల్లో తనదైన ముద్ర
90.75 సగటుతో 363 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. 2015 వన్డే ప్రపంచకప్లోనూ ధావన్ తన ముద్ర వేశాడు. 51.50 సగటుతో 412 పరుగులు చేసి టీమిండియా సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా (137)పై సెంచరీ చేసిన ధావన్ పాకిస్థాన్పై అర్ధసెంచరీ నమోదు చేశాడు.
ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో జైత్రయాత్ర
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో వరుసగా 68, 125, 78 పరుగులు చేసి సత్తా చాటాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు.
భారత్ విజయంలో కీలకపాత్ర
టోర్నీలో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 83 బంతుల్లో 78 పరుగులు చేసిన ధావన్ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధావన్కి ఇది 19వ అర్ధ సెంచరీ. అంతేకాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇది ధావన్కు నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ 90.3 యావరేజితో 271 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.
16 ఇన్నింగ్స్లతో ధావన్ వెయ్యి పరుగులు
ఐసీసీ నిర్వహించిన టోర్నీల్లో కేవలం 16 ఇన్నింగ్స్ల ద్వారానే ధావన్ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. 69.72 యావరేజితో 1046 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. దీంతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ధావన్ సరికొత్త రికార్డును సృష్టించాడు.
ధావన్ చేసిన అత్యధిక పరుగులు విదేశీ గడ్డపైనే
గతంలో సచిన్ 18 ఇన్నింగ్స్ల ద్వారా, గంగూలీ, మార్క్ వా 20 ఇన్నింగ్స్ల ద్వారా వెయ్యి పరుగులు పూర్తి చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఐసీసీ టోర్నమెంట్లలో ధావన్ అత్యధిక పరుగులు విదేశీ గడ్డపైనే సాధించడం. అందులోనూ టాప్ జట్లపైనే. 2015 వన్డే ప్రపంచకప్లో ఆసీస్తో సెమీస్లోనూ ధావన్ (45) రోహిత్తో కలిసి మంచి ఆరంభమే అందించాడు. అదే వరల్డ్ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికాపై అద్భుత సెంచరీని కూడా నమోదు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకపై కూడా చెలరేగి ఆడాడు.