బెంగుళూరు : న్యూజిలాండ్ తో తొలి టెస్టులో విఫలమవడంతో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంకు నాలుగు స్థానాలు దిగజారి 20కు చేరింది. న్యూజిలాండ్ తో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 9, రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులు మాత్రమే కోహ్లి నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం నాడు ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో 16వ స్థానం నుంచి 20వ స్థానంకు పడిపోయాడు కోహ్లి.
కోహ్లి విఫలమైనప్పటికీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. దీంతో 871 పాయింట్లతో అశ్విన్ తన మునుపటి స్థానాన్ని మెరుగుపరుచుకుని టాప్ 2 కు దూసుకెళ్లాడు. 878 పాయింట్లతో దక్షిణాఫ్రికా బౌలర్ స్టెయిన్ టాప్ లో నిలిచాడు.
ఇక బ్యాటింగ్ లో 879 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ టెస్టుల్లో టాప్ 2 స్థానానికు దూసుకెళ్లాడు. 906 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ టాప్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. కాగా, టీమ్ ఇండియా నుంచి ఒక్క బ్యాట్స్ మెన్ కూడా టాప్ టెన్ లో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
టీమ్ ఇండియా నుంచి మెరుగైన ర్యాంకు దక్కించుకున్నది అజింక్యా రహానే ఒక్కడే. 760 పాయింట్లతో 11వ స్థానాన్ని దక్కించుకున్నాడు రహానే. విలియమ్సన్ తర్వాత టాప్ మూడో స్థానంలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జో రూట్, నాలుగో స్థానంలో హషీమ్ ఆమ్లా, ఐదో స్థానంలో పాక్ బ్యాట్స్ మెన్ యూనిస్ ఖాన్ కొనసాగుతున్నారు.
ఐసీసీ టాప్ టెన్ టెస్ట్ జాబితా
1) స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా, 906 పాయింట్లు)
2) కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ (879పాయింట్లు)
3) జో రూట్ (ఇంగ్లాండ్, 878పాయింట్లు)
4)హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా 847పాయింట్లు)
5)యూనిస్ ఖాన్ (పాకిస్తాన్ 845 పాయింట్లు)
6) ఆడం వోజెస్ (ఆస్ట్రేలియా 802పాయింట్లు); ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా802)
8) డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా 772)
9) అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్ 770)
10) మిస్బావుల్ హక్ పాక్ (764పాయింట్లు)