బెంగుళూరు: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా రెండో స్థానానికి ఎగబాకాలంటే ఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి జరగనున్న నాల్గవ టెస్టులో విజయం సాధించాలి లేదంటే డ్రాగా ముగియాలి.
2-0తో ఇప్పటికే ఫ్రీడమ్ సిరిస్ను కైవసం చేసుకున్న టీమిండియా ఫ్రీడమ్ సిరిస్లో భాగంగా డిసెంబర్ 3 నుంచి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నాల్గవ టెస్టు ఆడనుంది. ఈ టెస్టు విజయం సాధించినా లేదా డ్రాగా ముగిసినా ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ టేబులో రెండో స్థానానికి ఎగబాకుతుంది.
ఫ్రీడమ్ సిరిస్ ప్రారంభమయ్యే నాటికి టీమిండియా పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉండగా, దక్షిణాఫ్రికా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల మొదట్లో ఇంగ్లాండ్పై పాకిస్థాన్ 2-0 తేడాతో విజయం సాధించడంతో టీమిండియా నవంబర్ 30 నాటికి నాల్గవ స్ధానంలో ఉంది.
సిరిస్ ప్రారంభానికి ముందు టీమిండియా 100 రేటింగ్ పాయింట్స్తో ఉంటే, దక్షిణాఫ్రికా 125 రేటింగ్స్ పాయింట్స్ను కలిగి ఉంది. కాగా ఢిల్లీ టెస్టులో టీమిండియా ఓటమిపాలైతే పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో ఉంటుంది.
ఢిల్లీ టెస్టు డ్రాగా ముగిస్తే:
భారత్ - 109
దక్షిణాఫ్రికా - 116
ఢిల్లీ టెస్టులో భారత్ విజయం సాధిస్తే:
భారత్ - 111
దక్షిణాఫ్రికా - 114