న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ర్యాంకింగ్స్: గెలిచినా, డ్రాగా ముగిసినా 2లో భారత్

By Nageswara Rao

బెంగుళూరు: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా రెండో స్థానానికి ఎగబాకాలంటే ఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి జరగనున్న నాల్గవ టెస్టులో విజయం సాధించాలి లేదంటే డ్రాగా ముగియాలి.

2-0తో ఇప్పటికే ఫ్రీడమ్ సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఫ్రీడమ్ సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 3 నుంచి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నాల్గవ టెస్టు ఆడనుంది. ఈ టెస్టు విజయం సాధించినా లేదా డ్రాగా ముగిసినా ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ టేబులో రెండో స్థానానికి ఎగబాకుతుంది.

ఫ్రీడమ్ సిరిస్ ప్రారంభమయ్యే నాటికి టీమిండియా పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉండగా, దక్షిణాఫ్రికా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల మొదట్లో ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్ 2-0 తేడాతో విజయం సాధించడంతో టీమిండియా నవంబర్ 30 నాటికి నాల్గవ స్ధానంలో ఉంది.

ICC Test Rankings: Win or draw in Delhi will take India to No. 2

సిరిస్ ప్రారంభానికి ముందు టీమిండియా 100 రేటింగ్ పాయింట్స్‌తో ఉంటే, దక్షిణాఫ్రికా 125 రేటింగ్స్ పాయింట్స్‌ను కలిగి ఉంది. కాగా ఢిల్లీ టెస్టులో టీమిండియా ఓటమిపాలైతే పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో ఉంటుంది.

ఢిల్లీ టెస్టు డ్రాగా ముగిస్తే:
భారత్ - 109
దక్షిణాఫ్రికా - 116

ఢిల్లీ టెస్టులో భారత్ విజయం సాధిస్తే:
భారత్ - 111
దక్షిణాఫ్రికా - 114

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X