42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసిన భారత్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హర్మన్ ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగి 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో నాటౌట్గా నిలిచింది.
40.1 ఓవర్లలో 245 పరుగులకే ఆసీస్ ఆలౌట్
282 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్పై భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి పైనల్లోకి ప్రవేశించింది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో అలెక్స్ బ్లాక్వెల్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 90 పరుగులు చేసింది.
బ్లాక్వెల్ అవుట్తో భారత్ విజయం ఖాయం
అంతేకాదు ఒకానొక సమయంలో భారత్ బౌలర్లకు చెమటలు పట్టించింది. 41వ ఓవర్లో దీప్తిశర్మ వేసిన బంతికి బ్లాక్వెల్(90) బౌల్డ్ అయింది. దీంతో భారత్ విజయం ఖాయమైంది. మరోవైపు హర్మన్, బ్లాక్వెల్ మంచి స్నేహితులు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో సిడ్నీ థండర్స్కి బ్లాక్వెల్ కెప్టెన్గా వ్యవహరిస్తోంది.
|
బీబీఎల్తో ఇద్దరి మధ్య స్నేహం
ఇదే జట్టులో హర్మన్ కూడా ఆడుతోంది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. దీంతో మ్యాచ్ అనంతరం బ్లాక్వెల్ తన జెర్సీని హర్మన్కి బహుకరించింది. కీలక మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన హర్మన్ను ఈ సందర్భంగా బ్లాక్వెల్ అభినందించింది. బిగ్బాష్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత క్రికెటర్గా కూడా కౌర్ నిలిచింది.