ముంబై: భారత్లో 2016లో జరగనున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్కు సంబంధించిన గ్రూపులు, మ్యాచ్ల వివరాలను శుక్రవారం (డిసెంబర్ 11)న ప్రకటించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం తెలిపింది.
ముంబైలోని ఓ హోటల్లో ఈరోజు జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, అజ్యింకే రహానేలు హాజరయ్యారు. వీరితో పాటు ఈ కార్యక్రమానికి ఐసీసీ ఛైర్మన్, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహార్తో పాటు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డసన్, బీసీసీఐ సెక్రటరీ అనురాగా ఠాకూర్లు హాజరయ్యారు.
మంగళవారం (డిసెంబర్ 8)న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 లోగోను ఆవిష్కరించారు. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న ఈ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్కు భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నమెంట్ను మొత్తం 8 పట్టణాల్లో నిర్వహించనుంది.
ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 ఫైనల్ మ్యాచ్ కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జరగనుంది. వరల్డ్ ట్వంటీ20 2016 టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వరల్డ్ ట్వంటీ20 ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క జట్టు కూడా ఈ టోర్నీని రెండోసారి గెలవకపోవడమే.
వరల్డ్ టీ20 ఛాంపియన్లు:
* 2007 - India beat Pakistan by 5 runs in final (Hosts South Africa)
* 2009 - Pakistan beat Sri Lanka by 8 wickets in final (England)
* 2010 - England beat Australia by 7 wickets in final (West Indies)
* 2012 - West Indies beat Sri Lanka by 36 runs in final (Sri Lanka)
* 2014 - Sri Lanka beat India by 6 wickets in final (Bangladesh)
తెలుగు వన్ఇండియా