హైదరాబాద్: బంగ్లాతో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ను పురస్కరించుకుని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఓ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించనుంది. గతంలో ఇక్కడ ఏ అంతర్జాతీయ మ్యాచ్ జరిగినా, దానికి సంబంధించి సావనీర్ (బ్రోచర్)ను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుండేది.
కొన్నాళ్ల పాటు కొనసాగించిన ఈ సంప్రదాయాన్ని ఆ తర్వాతి రోజుల్లో కొన్ని కారణాల వల్ల ఆపేశారు. మళ్లీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ క్రికెట్ టీమ్ మొట్టమొదటిసారి హెచ్సీఏను సందర్శించినప్పుడు ఈ సావనీర్ (బ్రోచర్) సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
అప్పట్లో ఈ మ్యాచ్ సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరిగింది. ఈ సంప్రదాయం తొంభైల్లో కొనసాగేది. ఇదిలా ఉంటే భారతలో బంగ్లాదేశ్ ఆడుతున్న తొలి టెస్టు కావడంతో ఈ సావనీర్ సంప్రదాయాన్ని కూడా మళ్లీ హెచ్సీఏ మొదలుపెట్టనుంది. ఈ బ్రోచర్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లకు సంబంధించిన విశేషాలతో పాటు కార్టూన్లు, గణాంకాలు ఉండనున్నాయి.