న్యూఢిల్లీ: న్యూజిలాండ్పై 3-0 తేడాతో టెస్టు సిరిస్ను క్లీన్ స్వీప్ చేసి టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరిన టీమిండియాకు వన్డేల్లో కూడా ర్యాంకుని మెరుగుపరుచుకునే అద్భుత అవకాశం వచ్చింది. ఈ నెల 16 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేలతో సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ వన్డే సిరిస్ను గనుక టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే వన్డే ర్యాంకుల్లో తన స్ధానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా 110 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్ధానంలో ఉంది.
రాబోయే ఐదు వన్డేల మ్యాచ్ సిరిస్ను ధోని నేతృత్వంలోని టీమిండియా 4-1తేడాతో నెగ్గితే నాల్గన స్థానం నుంచి మూడో స్ధానానికి ఎగబాకుతుంది. కాగా, న్యూజిలాండ్కు చెందిన ట్రెంట్ బౌల్ట్ ప్రస్తుతం వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నారు.
కాగా ఆసీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను వైట్ వాష్ చేసి దక్షిణాఫ్రికా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. గతంలో లేనివిధంగా ఆసీస్తో సాధించని వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన రికార్డును దక్షిణాఫ్రికా ఎట్టకేలకు సాధించారు. ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ తన కెరీర్ లోనే అత్యుత్తమంగా మూడో ర్యాంకుని సాధించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరిస్లో ఐదు వన్డేలు కలిపి డేవిడ్ వార్నర్ మొత్తం 386 పరుగులు చేశాడు. దీంతో తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్ టెన్లో చోటు దక్కించుకున్నాడు. కాగా 118 పాయింట్లతో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్ధానంలో ఉంది. కాగా వన్డేల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.