విజయ్, పుజారాల అరుదైన ఘనత
ఈ క్రమంలో వీరు టెస్టు బ్యాటింగ్లో అత్యధిక భాగస్వామ్య యావరేజ్ కలిగిన భారత జోడీగా అరుదైన ఘనతను సాధించారు. అంతక ముందు గంగూలీ, సచిన్ టెండూల్కర్లు మొదటి స్ధానంలో ఉన్నారు. విజయ్, పుజారాల టెస్టు భాగస్వామ్య యావరేజి 65.82గా ఉంది. వీరిద్దరి అత్యధిక భాగస్వామ్య పరుగులు 370. మొత్తంగా వీరు చేసిన పరుగులు 2238.
సచిన్, గంగూలీల రికార్డు బద్దలు
ఇక సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ టెస్టు భాగస్వామ్య యావరేజి 61.36 కాగా అత్యధిక భాగస్వామ్యం పరుగులు 281, మొత్తంగా చేసిన పరుగులు 4173. ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 24 పరుగులకే పెవిలియన్కు చేరినా విజయ్(70), పుజారా(47)లు రాణించారు.
రెండోరోజు ఆట ముగిసే సరికి భారత్ 146/1
దీంతో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసే సరికి భారత్ 52 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి 146 పరుగలు చేసింది. మురళీ విజయ్ 70, ఛటేశ్వర పుజారా 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండోరోజు ఆట ముగిసే వరకు వికెట్ పడకూడదని వీరిద్దరూ జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో విజయ్ 8 ఓవర్ల పాటు ఒక్క పరుగు కూడా చేయలేదు.
8ఓవర్ల ఆడి ఒక్క పరుగు చేయని విజయ్
44వ ఓవర్లో ఫోర్ బాది 63 నుంచి 68 పరుగులకు చేరుకున్న విజయ్ ఆఖరిదైన 52వ ఓవర్లో మాత్రమే రెండు పరుగులు చేశాడు. ఇంకా కోహ్లీ, నాయర్, అశ్విన్, పార్ధివ్ పటేల్, జడేజా, జయంత్ యాదవ్, భువనేవ్వర్, ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు ఆలౌటైంది.