హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐదు రోజుల టెస్టు మ్యాచ్కి ప్రాధాన్యం ఇస్తోందా? ఇందులో భాగంగానే టీమిండియాకు చెందిన పలువురు కీ బౌలర్లకు ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరిస్కు విశ్రాంతి కల్పించనుందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
స్వదేశంలో టీమిండియా 13 టెస్టు మ్యాచ్లు ఆడేలా బీసీసీఐ షెడ్యూల్ని రూపొందించింది. వీటిల్లో ఇప్పటికే ఆరు టెస్టు మ్యాచ్లను టీమిండియా ఆడగా ఇంకా ఏడు టెస్టు మ్యాచ్లు మిగిలున్నాయి. ఇందులో టెస్టుల్లో రాణించేందుకు భారత జట్టు కీలక బౌలర్లకు వన్డేలు, టీ20ల నుండి విశ్రాంతి కల్పించనున్నారు.
టెస్టు క్రికెట్కు ప్రాతినిధ్యం ఇచ్చే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న యువ బౌలర్లకు వన్డేలు, టీ20ల్లో చోటు కల్పించినట్లు అవుతుందని భావిస్తోంది.
జాతీయ మీడియాలో వచ్చిన వార్తా కథనం ప్రకారం ఇంగ్లాండ్తో వచ్చే నెలలో జరగనున్న వన్డే, టీ20 సిరిస్కు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే 15 నుంచి పుణెలో జరగనున్న మ్యాచ్తో ఇంగ్లాండ్తో వన్డే సిరిస్ ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ సిరిస్ అనంతరం టీమిండియా బంగ్లాదేశ్తో ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్ పర్యనటకు రానుంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
నవంబర్ 9-13 - తొలి టెస్ట్ - రాజ్కోట్
నవంబర్ 17-21 - రెండో టెస్ట్ - విశాఖ
నవంబర్ 26-30 - మూడో టెస్ట్ - మొహాలి
డిసెంబర్ 8-12 - నాలుగో టెస్ట్ - ముంబై
డిసెంబర్ 16-20 - అయిదో టెస్ట్ - చెన్నై
మూడు వన్డేల సిరీస్
జనవరి 15 - తొలి వన్డే - పుణే
జనవరి 19 - రెండో వన్డే - కటక్
జనవరి 22 - మూడో వన్డే - కోల్కతా
మూడు ట్వంటీ 20ల సిరీస్
జనవరి 26 - తొలి ట్వంటీ 20 - కాన్పూర్
జనవరి 29 - రెండో ట్వంటీ 20 - నాగపూర్
ఫిబ్రవరి 1 - మూడో ట్వంటీ 20 - బెంగళూరు