హైదరాబాద్: త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. మణికట్టు గాయంతో బాధపడుతున్న మురళీ విజయ్ స్ధానంలో శిఖర్ ధావన్ని ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు బీసీసీఐ అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. శ్రీలంక పర్యటనకు సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని గతంలోనే సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో మురళీ విజయ్ చోటు దక్కించుకున్నాడు. అయితే మురళీ విజయ్ మణికట్టు గాయం ఇంకా నయం కాకపోవడంతో అతడిని తప్పించి ధావన్కు చోటు కల్పించారు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం మురళీ విజయ్ తన మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక ట్వంటీ 20 ఆడనుంది. ఇరు జట్ల మధ్య మూడు ఫార్మాట్లలో సిరీస్ జరగడం ఎనిమిదేళ్ల తరువాత ఇదే తొలిసారి.
ఈ సిరీస్లో భాగంగా జులై 26 నుంచి గాలేలో తొలి టెస్టు జరుగుతుంది. 2009లో భారత్లో శ్రీలంక పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్తో పాటు, ఐదు వన్డేల సిరీస్, రెండు ట్వంటీ 20ల సిరీస్లు ఇరు జట్ల మధ్య జరిగాయి. ఇక, రెండేళ్ల క్రితం శ్రీలంకలో భారత్ పర్యటించినప్పటికీ టెస్టు సిరీస్, వన్డే సిరీస్ మాత్రమే జరిగింది.
UPDATE: @SDhawan25 to replace injured Murali Vijay for India’s tour of Sri Lanka, 2017 pic.twitter.com/OD07odsd3q
— BCCI (@BCCI) July 17, 2017