హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం ప్రారంభమైంది. తొలిసారిగా ఓ టెస్టు మ్యాచ్కు ఈ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ క్రమంలో పిచ్ బాగా పొడిగా ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ముంబైలోని వాంఖడె స్టేడియం మాదిరి ఈ స్టేడియంలోని పిచ్ పైనా పగుళ్లు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బాగా డ్రైగా ఉందని, బౌన్స్కు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నామని టాస్ గెలిచిన అనంతరం స్టీవ్ స్మిత్ తెలిపాడు.
టీ20 మ్యాచ్లకు, టెస్టులకు చాలా తేడా ఉందని, ఈ టెస్టు సిరీస్కు బాగా ప్రాక్టీస్ చేశామని చెప్పాడు. ఆసీస్ తరుపున ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎటువంటి అంచనాలు లేకుండానే టాస్కు వచ్చానని అన్నాడు.
కోహ్లీ కూడా స్లో పిచ్ నుంచి స్పిన్ ఆశిస్తున్నట్టు చెప్పాడు. అయితే ఇక్కడు రివర్స్ స్వింగ్కు కూడా అవకాశాలున్నాయి. టాస్ అనంతరం కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ ఉపఖండంలో ఇటువంటి పిచ్ను తానెన్నడూ చూడలేదని చెప్పాడు.
Australia win the toss and elect to bat first in the 1st @Paytm Test #INDvAUS pic.twitter.com/BfCRsrkbB4
— BCCI (@BCCI) 23 February 2017
ఇక స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సైతం ఇదే అభిప్రాయాన్న వ్యక్తం చేశాడు. 'టెస్టు తొలిరోజునే ఐదో రోజు పిచ్ మాదిరి కనిపిస్తోంది. ఈ టెస్టులో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన వారికి పిచ్ లాభిస్తుంది' అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.
భారత్లో స్పిన్కు అనుకూలంగా ఉంటే పిచ్లను చూశాం గానీ, ఈ తరహా పిచ్ను తానెన్నడూ చూడలేదని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతుండగా, ఆసీస్ మాత్రం ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు, ఒక ఆల్రౌండర్తో బరిలోకి దిగింది.
Pitch-vision #INDvAUS @Paytm Test Cricket pic.twitter.com/4EBxBVC4fa
— BCCI (@BCCI) 23 February 2017