హైదరాబాద్: భారత్తో జరిగే చివరి రెండు టెస్టులకు మిచెల్ స్టార్క్ స్ధానంలో ఆసీస్ పేసర్ పాట్రిక్ కుమ్మిన్స్కి తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. గాయం కారణంగా నాలుగు టెస్టుల సిరిస్లో మిగతా రెండు టెస్టులకు మిచెల్ స్టార్క్ దూరమైన సంగతి తెలిసిందే.
గాయం కారణంగా మిచెల్ స్టార్క్ మిగతా రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు ఆసీస్ ఫిజియోథెరపిస్టు డేవిడ్ తెలిపారు. 'బెంగుళూరులో జరిగిన రెండో టెస్టులో స్టార్క్ కుడి కాలికి గాయమైంది. ఆ టెస్టు మ్యాచ్ లో స్టార్క్ కుడి కాలు స్వల్పంగా చిట్లడంతో విపరీతమైన బాధతో సతమతమయ్యాడు. అతని కాలుకు తీయించిన స్కానింగ్ లో కొద్దిపాటి పగులు వచ్చినట్లు తేలింది. దాంతో అతను స్వదేశానికి వెళ్లక తప్పడం లేదు. అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. స్టార్క్ జట్టుకు దూరం కావడం నిజంగా మా దురదృష్టం. టెస్టు సిరీస్కు స్టార్క్ పూర్తిగా అందుబాటులో ఉంటాడని తొలుత భావించినా అలా జరగలేదు' అని ఆయన అన్నారు.
JUST IN: Pat Cummins named Mitchell Starc's replacement in Australia's Test squad https://t.co/DMZCNFaAg6 #INDvAUS pic.twitter.com/P3VKJhlgzk
— cricket.com.au (@CricketAus) 11 March 2017
కాగా పాట్రిక్ కుమ్మిన్స్ తన కెరీర్లో ఒకే ఒక టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2011లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కుమ్మిన్స్ ఏడు వికెట్లు (రెండో ఇన్నింగ్స్లో 6/79) తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బిగ్ బాష్ టోర్నీతో పాటు ఈ మధ్య కాలంలో జరిగిన వన్డేలు, టీ20 మ్యాచ్ల్లో కుమ్మిన్స్ అద్భుత ప్రదర్శన చేశాడు.
షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆడిన టెస్టు తొలి ఇన్నింగ్స్లో 4-57తో సత్తా చాటగా, ఇక రెండో ఇన్నింగ్స్లో 4-47తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనే అతడికి టెస్టు జట్టులో చోటు దక్కేలా చేసిందని జాతీయ సెలక్టర్ ట్రేవర్ హాన్స్ పేర్కొన్నాడు. కుమ్మిన్స్ శనివారం ఆసీస్ జట్టులో చేరనున్నాడు. తొలి టెస్టు అనంతరం దాదాపు ఆరేళ్ల పాటు టెస్టులకి దూరమైన కమిన్స్ మళ్లీ భారత్తో పునరాగమనం చేస్తుండటం విశేషం.
ఆసీస్కు మరో ఎదురుదెబ్బ: చివరి రెండు టెస్టులకు స్టార్క్ దూరం
ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరిస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమమైంది.