హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు తొలి రోజున పుజారా 52 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా 177 బంతులను ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేశాడు.
కోహ్లీ అర్ధసెంచరీ: సెంచరీ వీరుడు మురళీ విజయ్ అవుట్
ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు చందు బోర్డే రికార్డుని పుజారా అధిగమించాడు. 1964-65 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ సీజన్లో 28 ఇన్నింగ్స్ (21 మ్యాచ్లు) ఆడిన బోర్డే 1,604 పరుగులు నమోదు చేశాడు. తాజాగా పుజారా 21 ఇన్నింగ్స్ (13 మ్యాచ్లు)ల్లోనే 1,605 పరుగులు చేసిన బోర్డే చేసిన స్కోరుని అధిగమించాడు.
29 ఏళ్ల పుజారా ప్రస్తుతం భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఇరానీ కప్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పుజారా 86, 116 పరుగులు సాధించాడు. అంతక ముంది ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పుజారా రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీని సాధించాడు..
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా 4-0తో కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్తో ఏకైక టెస్టు మ్యాచ్ జరగకముందు 43 టెస్టు మ్యాచ్ల్లో పుజారా 3,256 పరుగులు చేశాడు. 2010లో ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్లో పుజారా అరంగేట్రం చేశాడు.