హైదరాబాద్: గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ గురువారం (డిసెంబర్ 8) నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో చేతి వేలుకు గాయం కారణంగా మొహాలిలో జరిగిన మూడో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరిస్లో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్ మురళీ విజయ్తో కలిసి ఓపెనింగ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ గత రెండు టెస్టుల్లో ఆశించిన మేరకు రాణించలేదు.
గత నాలుగు ఇన్నింగ్స్లో 32, 38, 0, 10 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపర్చాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టు రాజ్ కోట్లో జరిగింది. ఈ టెస్టులో రాహుల్కు బదులు ఓపెనర్గా గౌతమ్ గంభీర్ చోటు దక్కించుకున్నాడు.
అయితే తొలి టెస్టులో గంభీర్ విఫలం కావడంతో అతని స్ధానంలో రెండో టెస్టులో కేఎల్ రాహుల్ వచ్చాడు. విశాఖపట్నం టెస్టులో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిరాశపరిచింది. విశాఖ టెస్టులో కేఎల్ రాహుల్ గాయాలు పాలవడంతో మొహాలిలో జరిగిన మూడో టెస్టుకు అతడి స్ధానంలో ఓపెనర్గా కీపర్ పార్ధీవ్ పటేల్ బరిలోకి దిగాడు.
మొహాలి టెస్టులో పార్ధీవ్ పటేల్తో పాటు కరుణ్ నాయర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో నాయర్ అనుకోకుండా రనౌట్ అయ్యాడు. ఇక రెగ్యులర్ కెప్టెన్ వృద్ధమాన్ సాహా గాయాలు పాలవడంతో అతడి స్ధానంలో సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి పార్ధీవ్ పటేల్ వచ్చాడు.