న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఒక్కడే అలా: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా జట్టులోకి

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ధోని ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే ఈ వన్డే సిరిస్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డే సిరిస్‌కు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదే గనుక నిజమైతే రెండున్నర నెలల విరామం తర్వాత ధోని ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా తొలిసారి ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నట్లు అవుతుంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరి 15న పుణే వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.

<strong>స్పెయిన్‌లో ధోని: ఫ్యాన్స్ ఆశ్చర్యం, భారీ షాట్(ఫోటోలు)</strong>స్పెయిన్‌లో ధోని: ఫ్యాన్స్ ఆశ్చర్యం, భారీ షాట్(ఫోటోలు)

ఆ తర్వాత జనవరి 26 నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. విశాఖపట్నంలో అక్టోబర్ 29న న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత నుంచి ధోనీ రెండున్నర నెలలుగా ఖాళీగానే ఉంటున్నాడు. నిజానికి ప్రొటోకాల్‌ ప్రకారం గాయపడిన టీమిండియా ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడానికి దేశవాళీ టోర్నీల్లో పాల్గొంటేనే జాతీయ జట్టు సెలెక్షన్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.

India Vs England: MS Dhoni to play ODI series without a practice match?

అయితే ధోని విషయంలో ఇలాంటి నిబంధనలు ఏమీ లేవని తెలుస్తోంది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ధోని ఇప్పటవరకు ఒక్క రంజీ ట్రోఫీలో కూడా ఆడలేదు. అయితే దేశవాళీ టోర్నీలో ప్రతిష్టాత్మకంగా తీసుకునే విజయ్‌ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 25 నుంచి వచ్చే దేశవాళీ సీజన్‌ ప్రారంభం కానుండడంతో వన్డే, టీ20 సిరీస్‌లకు ముందు ప్రాక్టీస్‌ లేకుండా పోయింది.

<strong>హెల్‌‌కాట్‌ బైక్‌పై ధోని కూతురు: ఇంటర్నెట్‌లో వైరల్</strong>హెల్‌‌కాట్‌ బైక్‌పై ధోని కూతురు: ఇంటర్నెట్‌లో వైరల్

రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ జట్టు నాక్-ఔట్ స్టేజికి అర్హత సాధించింది. అయితే రంజీ ట్రోఫీలో ధోని ఆడతాడా లేదా అనే దానిపై తమకు సమాచారం లేదని టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పీటీఐతో అన్నారు. అయితే జార్ఖండ్ జట్టుకు ధోని ఓ మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ వర్మ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X