చెన్నై: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదో టెస్టుపై సందిగ్ధం నెలకొంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో షెడ్యూల్ ప్రకారం ఆఖరి మ్యాచ్ను డిసెంబర్ 16 నుంచి 20 మధ్య చెన్నైలో నిర్వహించాలి. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి.
జయలలిత 'గ్రేటెస్ట్ క్రష్': ఆ క్రికెటర్ ఎవరు?
సోమవారం రాత్రి ఆమె కన్నుమూయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొన్న ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేదిక మార్పుపై బీసీసీఐ వేచిచూసే ధోరణిలో ఉంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని బీసీసీఐ ప్రకటించింది.
సీఎం జయలలిత మృతిచెందడం దురదృష్టకరమని, వేదిక మార్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి అజయ్షిర్కే తెలిపారు. 'బోర్డు ఇంకా దీని గురించి ఆలోచించలేదు. పరిస్థితిని బట్టి, మ్యాచ్ జరిగే సమయంలో నగర అభిమానుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యల గురించి అసోసియేషన్తో చర్చిస్తాం. దీనికి ఎలాంటి తుది గడువూ లేదు. మనకు అవసరమైతే టెస్టు నిర్వహణ కోసం చాలా వేదికలు సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం' అని షిర్కే వెల్లడించారు.
ఒకవేళ పరిస్ధితులు అనకూలంగా లేకపోతే రోటేషన్ పద్ధతిలో భాగంగా మ్యాచ్ను వేరొక వేదికకు మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. 75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) డిసెంబర్ 5 (సోమవారం) రాత్రి కన్నుమూశారు. సోమవారం రాత్రి 11.30కు జయలలిత మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.