జమ్మూ కాశ్మీర్ జట్టుతో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఫోన్
'సయ్యత్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ జట్టుతో ట్రైనింగ్లో ఉన్నా. బీసీసీఐ ఆఫీసు నుంచి ఉదయం నాకు ఫోన్ రాగానే హడావుడిగా ఢిల్లీకి ప్లయిట్ పట్టుకుని బయల్దేరా' అని చెప్పుకొచ్చాడు. 2014 జూన్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ఇంగ్లాండ్తో జరిగిన వార్మప్ గేమ్లో సత్తా చాటాడు
తన అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్లో రెండు వికెట్లు తీసుకున్న రసూల్కు బీసీసీఐ సెలక్టర్ల నుంచి సుదీర్ఘ విరామం పిలుపొచ్చింది. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన వార్మప్ గేమ్లో ఇండియా-ఏ జట్టులో అడిన రసూల్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా రసూల్ నిలకడగా రాణించడం వల్లే సెలక్టర్లు నుంచి అతడికి పిలుపొచ్చిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి
ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల టి-20 సిరీస్కు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చి, వారి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్ను ఎంపిక చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మార్పులు చేసిందని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఇంగ్లాండ్తో జరగనున్న టీ20 సిరిస్లో చోటు
లభించడంపై రసూల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఈ సిరిస్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ కెప్టెన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు రసూల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.