హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్లు మ్యాచ్ జరిగే ది ఓవల్ స్టేడియానికి చేరుకున్నాయి. మరోవైపు మ్యాచ్ మొదలవడానికి మూడు గంటల ముందు నుంచే అభిమానులు కూడా స్టేడియానికి క్యూ కట్టారు. మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివస్తున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతమంతా ఇండియా, పాక్ అభిమానులతో సందడి సందడిగా మారింది. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలతో పాటు జాతీయ జెండాలను అభిమానులు చేత పట్టుకుని మైదానానికి తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం చోటుచేసుకుంది.
🇮🇳 The reigning champions are in the house! #PAKvIND #CT17 pic.twitter.com/kfGjcTbmeK
— ICC (@ICC) June 18, 2017
🇵🇰 Pakistan have arrived at the The Oval for the #CT17 final! #PAKvIND pic.twitter.com/HYfpWrNa29
— ICC (@ICC) June 18, 2017
90 minutes until play starts, but already the 🇮🇳 fans are making themselves heard! #PAKvIND #CT17 pic.twitter.com/URtbYqlHWQ
— ICC (@ICC) June 18, 2017
The Oval is ready to receive today's finalists! #PAKvIND #CT17 pic.twitter.com/lx0wJ9ohBY
— ICC (@ICC) June 18, 2017