న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెన్ టాప్ బస్సుపై ఫ్యాన్స్ హల్ చల్: ఓవల్‌కు చేరుకున్న ఇరు జట్లు

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆదివారం టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో మధ్యాహ్నాం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ఇరు జట్లు మ్యాచ్ జ‌రిగే ది ఓవ‌ల్ స్టేడియానికి చేరుకున్నాయి. మరోవైపు మ్యాచ్ మొదలవడానికి మూడు గంట‌ల ముందు నుంచే అభిమానులు కూడా స్టేడియానికి క్యూ క‌ట్టారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో మైదానానికి తరలివస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆ ప్రాంత‌మంతా ఇండియా, పాక్ అభిమానుల‌తో సంద‌డి సందడిగా మారింది. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన ఫోటోలతో పాటు జాతీయ జెండాలను అభిమానులు చేత పట్టుకుని మైదానానికి తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం చోటుచేసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X