పుణె వన్డేలోనూ అలాగే జరిగింది
పుణె వన్డేలోనూ అలాగే జరిగిందని చెప్పాడు. కోహ్లీని లక్ష్యంగా చేసుకున్న బౌలర్లు నన్ను తేలికగా తీసుకున్నారు. ఇదే వారి కొంపముంచింది. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు రాబట్టాను అని చెప్పాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
ఐదో వికెట్కు 200కు పైగా పరుగులు
63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ-జాదవ్ల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్ధానిక ఆటగాడైన కేదార్ జాదవ్ చెలరేగి ఆడుతుంటే కోహ్లీ అతడికి మద్దతు తెలుపుతూ మైమరచిపోయాడు. మ్యాచ్ అనంతరం జాదవ్ ఇన్నింగ్స్ను కెప్టెన్ కోహ్లీ ఎంతో ప్రశంసించాడు.
ప్రతీ మ్యాచ్ను చివరిదిగానే భావిస్తాను
‘నేను ఆడే ప్రతీ మ్యాచ్ను చివరిదిగానే భావిస్తాను. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అత్యుత్తమ స్థాయిలో రాణించాలని కోరుకుంటాను. అంతకంటే ఎక్కువగానే ఇస్తాన' అని జాదవ్ చెప్పాడు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో బాధపడుతున్నా భారత ఏ జట్టు తరఫున ఆడిన ఇన్నింగ్స్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని జాదవ్ అన్నాడు.
టెన్నిస్ బాల్తో స్ట్రయిట్ సిక్సర్లు ఆడే టోర్నీలు ఆడా
గతంలో టెన్నిస్ బాల్తో స్ట్రయిట్ సిక్సర్లు మాత్రమే ఆడే టోర్నీలు ఆడానని ఆ అనుభవం ఈ మ్యాచ్లో పనికొచ్చిందని కేదార్ చెప్పాడు. క్లిష్టపరిస్థితులను తాను అవకాశంగా మలుచుకున్నానని చెప్పాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్తో రాత్రికి రాత్రే స్టార్గా ఎదిగినా తాను వాస్తవంలోనే బతకాలనుకుంటున్నట్టు కేదార్ చెప్పాడు.