న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ పగలబడి నవ్వాడు: క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీల్ పదో సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 18 (మంగళవారం)న రాజ్‌కోట్‌ వేదికగా బెంగళూరు, గుజరాత్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభానికి ముందు గుజరాత్ లయన్స్ ఆటగాడు రవీంద్ర జడేజా కొత్త లుక్‌ను చూసి బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పడి పడి నవ్విన సంగతి తెలిసిందే.

వీరిద్దరి సంభాషణలో భాగంగా జడేజా వైపు వేలు చూపిస్తూ విరాట్‌ కోహ్లీ పగలబడి నవ్వాడు. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు జడేజా కొత్త హెయిర్‌స్టైల్‌ చూసి కోహ్లీ అంతలా నవ్వాడని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు. ఈ ఫోటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కోహ్లీ నవ్వుకు గల కారణాన్ని రవీంద్ర జడేజా వెల్లడించాడు.

రాజ్‌పుత్ అని పిలిచాడు

రాజ్‌పుత్ అని పిలిచాడు

ఈ ఫోటోకు ముందు కోహ్లీ నన్ను రాజ్‌పుత్‌ అని పిలిచాడని, ఇది నన్ను అతను ముద్దుగా పిలిచే పేరని జడేజా పేర్కొన్నాడు. అయితే కోహ్లీ ఇలా పిలిస్తే గర్వంగా ఉంటందని జడ్డూ తెలిపాడు. మేమిద్దరం అన్నదమ్ములమని, మా మధ్య రిలేషన్‌షిప్‌లో భాగాంగానే కోహ్లీ అలా నవ్వాడని జడేజా వ్యాఖ్యానించాడు.

కోహ్లి నాకు రాజ్‌పుత్‌ అని ముద్దుపేరు పెట్టాడు

కోహ్లి నాకు రాజ్‌పుత్‌ అని ముద్దుపేరు పెట్టాడు

‘ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు విరాట్‌ నా దగ్గరికి వచ్చి ‘రాజ్‌పుత్‌' అని పిలిచాడు. ఆ సమయంలో విరాట్‌ నావైపు చూస్తూ నవ్వుతుండగా అనుకోకుండా ఆ ఫొటో తీశారు. కోహ్లి నాకు రాజ్‌పుత్‌ అని ముద్దుపేరు పెట్టాడు. అలా పిలిచినప్పుడల్లా నాకెంతో గర్వంగా ఉంటుంది. మేమిద్దరం సోదరులాంటివాళ్లం. మా మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌లో భాగంగానే సరదా సంభాషణ ఒక భాగం' అని జడేజా అన్నాడు.

బ్రేక్‌ ది బియర్డ్‌ ఛాలెంజ్‌పై

బ్రేక్‌ ది బియర్డ్‌ ఛాలెంజ్‌పై

ఇక బ్రేక్‌ ది బియర్డ్‌ ఛాలెంజ్ విసరడానికి గల కారణాన్ని కూడా రవీంద్ర జడేజా వెల్లడించాడు. భారత ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్‌ రూంలో ఒకేలా గడ్డాలు పెంచుకోవడంతో కొత్తగా ఉండాలని అలా చేశానని చెప్పుకొచ్చాడు. ఒక రోజు భారత జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో నడుస్తున్నప్పుడు అతను నన్ను కేఎల్‌ రాహుల్‌లా భావించి కన్నడంలో మాట్లడటం మొదలు పెట్టడాని తెలిపాడు.

గడ్డాలపై అందరూ అయోమయం

గడ్డాలపై అందరూ అయోమయం

దీంతో ఈ గడ్డాలు అందరినీ అయోమయానికి గురి చేస్తున్నాయని అందుకే ఈ చాలేంజ్‌ విసిరానని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. జడేజా విసిరిన ఈ ఛాలెంజ్‌ని టీమిండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రహానేలు అనుసరించగా, కోహ్లీ మాత్రం స్వీకరించలేదు

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X