న్యూఢిల్లీ: ఐపీఎల్ 9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వైఫల్యం చెందుతోంది. పంజాబ్ ఆడే మ్యాచులకు ఆ మ్యాజ్ సహయజమాని ప్రీతిజింతా హాజరవుతుంటారు. మ్యాచ్ ఓడిపోయినప్పుడల్లా ఆమె మొహంలో ఆవేదన కనిపిస్తుంటుంది. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటుంది.
ఐపీఎల్ 9లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఇప్పటి దాకా 10 మ్యాచులు ఆడి కేవలం మూడు మాత్రమే గెలిచింది. టెక్నికల్గా పక్కన పెడితే.. పంజాబ్ ఇంటి దారి పట్టినట్లే!
ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. దీనిపై ప్రీతిజింతాకు కోపం వచ్చిట్లుగా వార్తలు వస్తున్నాయి.
సమాచారం మేరకు... బెంగళూరు పైన పంజాబ్ ఓడిపోగానే ప్రీతిజింతా.. హెడ్ కోచ్ సంజయ్ బంగర్తో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్ విషయమై బంగర్ నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారని తెలుస్తోంది.
ఆమె ఆటగాళ్ల ముందే బంగర్ను నిలదీశారని తెలుస్తోంది. అంతేకాదు, తొలగిస్తానని హెచ్చరించారని తెలుస్తోంది. మ్యాచ్ ఓడిపోగానే డగౌట్లోకి వచ్చిన ప్రీతిజింతా.. బంగర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఒక్క పరుగు: తలపట్టుకున్న ప్రీతిజింతా, కోహ్లీ డ్యాన్స్
అయితే, ఇరువురు అంటే ప్రీతిజింతా, బంగర్ కూడా తమ మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని వివరణ ఇచ్చారని తెలుస్తోంది. అయితే వారి మధ్య గొడవను నలుగురు సాక్షులు చూసినట్లుగా చెబుతున్నారు. బెహార్డియన్, అక్షర్ పటేల్లను బ్యాటింగుకు పంపిన విషయమై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
మ్యాచ్లలో ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, రాణిస్తున్న అక్షర్ పటేల్ను కాదని బెహార్డిన్ను బ్యాటింగుకు పంపడం ప్రీతిజింతాకు కోపం తెప్పించిందని తెలుస్తోంది. ఆమె తన నోటికి పని చెప్పడంతో సమాధానం చెప్పలేక బంగర్ వెళ్లిపోయాడని అంటున్నారు.