హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం జరిగే మ్యాచ్ ప్రతిష్టాత్మకం కావడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ సహచర క్రికెటర్లు స్పూర్తి సందేశాన్ని వినిపించాడు. బెంగళూరు ఆటగాళ్లు ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ను తొలి అవకాశంగా భావించాలని సహచరులకు సూచించాడు.
ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమిపాలై ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్తరికార్డును బెంగళూరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఒత్తిడికి లోనైన ఆటగాళ్లలో స్పూర్తిని కలిగించే ఓ వీడియోను బెంగళూరు జట్టు తన ఫేస్బుక్ అఫీషియల్ పేజిలో అప్లోడ్ చేసింది.
ఈ వీడియోలో డివిలియర్స్ ఆటగాళ్లను ఓటిమిపై ప్రతి ఒక్కరు అద్దంలో చూసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించాడు. ఇప్పటికి 7 మ్యాచ్లే అయ్యాయని, మరో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉందని చెప్పాడు. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ను తొలి అవకాశంగా భావించి రాణించాలని అందులో డివిలియర్స్ పేర్కొన్నాడు.
ఈ విజయ పరంపర సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నుంచే కొనసాగాలని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కోల్కతా మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ గొల్డెన్ డకౌట్ కాగా, స్టార్స్ బ్యాట్స్ మెన్లు క్రిస్ గేల్, డివిలియర్స్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఈ సీజన్లో ఏడు మ్యాచుల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.