హైదరాబాద్: టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరుగాంచిన సురేశ్ రైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సురేశ్ రైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ క్రమంలో అర్ధసెంచరీతో తన జట్టును గెలిపించిన సురేశ్ రైనా... ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టి మొదటి స్థానానికి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 153 మ్యాచ్లు ఆడిన సురేశ్ రైనా మొత్తం 4,341 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో 4,264 పరుగులు చేసిన కోహ్లీ రెండో స్ధానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(3923), కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్(3863) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఐపీఎల్లో ఇప్పటిరకు 153 మ్యాచుల్లో 149 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 139.09 స్ట్రైక్ రేటుతో 4,341 పరుగులు చేశాడు.
ఇందులో ఒక సెంచరీ, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 167 సిక్సర్లు, 384 ఫోర్లు బాదాడు. అయితే రైనా, కోహ్లీల మధ్య పరుగుల తేడా తక్కువగా ఉండడంతో మొదటి స్ధానం కోసం వీరిద్దరూ పోటీపడుతున్నారు. ఐపీఎల్ పదో సీజన్లో రైనాను అధిగమించి కోహ్లీ అగ్రస్థానానికి వెళ్లాడు. మళ్లీ ఇప్పుడు రైనా మొదటి స్ధానాన్ని దక్కించుకున్నాడు.