ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ప్రపంచంలోనే అత్యుత్త ఫీల్డర్గా పేరొందిన జాంటీ రోడ్స్.. ఇప్పుడు కూతురు కోసం పూజారిలా మారిపోయాడు. భారతదేశం తనకు రెండో ఇల్లని, హిందూ మత విశ్వాసాలపై తనకెంతో గౌరవమని చెప్పుకునే జాంటీ రోడ్స్.. తాజాగా పూజారి అవతారం ఎత్తి దుర్గమ్మకు పూజలు చేశాడు.
సంప్రదాయ పంచె కట్టుకుని పెజావర్ మఠానికి వచ్చిన ఆయన కనకదుర్గమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశాడు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ లో పెట్టగా.. వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు క్రికెటర్లు దీన్ని షేర్, రీట్వీట్ చేస్తున్నారు.
కాగా, ఇండియాపై ఉన్న అభిమానంతో జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జీనే రోడ్స్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాంటీ రోడ్స్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా కొనసాగుతున్నారు.