హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రికార్డుల మోత మోగుతుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ క్రికెటర్ కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ సాధించి ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. 391/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది.
ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరిస్లో భాగంగా మూడో టెస్టులో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ చెన్నై టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిదే తొలి డబుల్ సెంచరీ. తన కెరీర్లో మూడో టెస్టు ఆడుతున్న నాయర్ 309 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.
అంతేకాదు తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో భారత బ్యాట్స్మన్గా నాయర్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. గతంలో వినోద్ కాంబ్లి(224), దిలీప్ సర్దేశాయ్(200 నాటౌట్) ఈ ఘనత సాధించారు. మొత్తం మీద టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 31వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
మరోవైపు ఐదో టెస్టులో నాయర్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఒక మ్యాచ్లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నాయర్ నిలిచాడు. ఈ టెస్టులో నాయర్ 225 పరుగుల వ్యక్తిగత పరుగులను దాటిన క్రమంలో ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
2013లో ఆస్ట్రేలియాపై ధోని 224 పరుగులను సాధించాడు. ఇదే ఇప్పటివరకూ ఐదు అంతకంటే తక్కువ స్థానాల్లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు బ్యాటింగ్ రికార్డుగా ఉంది. దీనిని చెన్నై టెస్టులో నాయర్ అధిగమించాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరిస్కు దూరమైన రోహిత్ శర్మ స్ధానంలో నాయర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
200 ✅! @karun126 brings up his maiden double hundred in Test cricket #INDvENG pic.twitter.com/MDmFdIlmh2
— BCCI (@BCCI) December 19, 2016