హైదరాబాద్: రన్ మెషిన్, ఛేజింగ్ హీరో అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత తన తొలి వన్డే సిరిస్లో కెప్టెన్గా తన సత్తా ఏంటో చూపించాడు.
ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరిస్లో ఓ సెంచరీతో పాటు అర్ధసెంచరీ చేసి అభిమానులను అలరించాడు. ఇంగ్లాండ్పై మూడు వన్డేల సిరిస్ను 2-1తో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫత్యంలో కోహ్లీ బీసీసీఐ వెబ్సైట్కి ఇంటర్యూ ఇచ్చాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీని అభిమానులు 'కింగ్ కోహ్లీ', 'కెప్టెన్ ఫియర్లెస్' అంటూ పొగిడారు. ఈ రెండింటిలో మీకు ఏది బాగా నచ్చిందని కోహ్లీని మీడియా ప్రతినిధులు అడగ్గా కోహ్లీ నోటి నుంచి వింత సమాధానం వచ్చింది.
అదేటంటే డ్రస్సెంగ్ రూమ్లో జోకర్గా ఉండేందుకు తాను ఇష్టపడతానని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఇంగ్లాండ్తో ముగిసిన సిరిస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన కేదార్ జాదవ్పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు.
ముఖ్యంగా జట్టు విజయంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారని అన్నాడు. మరోవైపు టీమిండియా వెటరన్ ఆటగాళ్లు ధోని, యువరాజ్ సింగ్లు ఫామ్లోకి రావడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇవన్నీ జట్టుకు ఎంతగానో కలిసొచ్చే అంశాలని పేర్కొన్నాడు. ఈడెన్ గార్డెన్ పిచ్ ఛాంపియన్స్ ట్రోఫీకి చక్కగా సరిపోతుందని తెలిపాడు.