ఎప్పుడూ యాక్టివ్గా ఫుల్ ఎనర్జిటిక్గా
ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఫుల్ ఎనర్జిటిక్గా కోహ్లీ దర్శనమిస్తుంటాడు. అయితే ఇందుకు ప్రధాన కారణం కోహ్లీ తాను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే. మ్యాచ్లో వేగంగా సింగిల్స్ తీసేందుకు గాను అందుకు అడ్డుగా ఉన్న బటర్ చికెన్, మటన్ రోల్స్ని తినడమే మానేశాడంట.
ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి
ఈ విషయాన్ని కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ క్రికెట్ నెక్ట్స్ అనే వెబ్ సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. పరిపూర్ణమైన ఆటగాడిగా మారిన తర్వాత డైట్, ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ తీసుకునే జాగ్రత్తలు తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పుకొచ్చాడు.
కోహ్లీ నిబద్ధతే కారణం
టెస్టు కెప్టెన్ నుంచి మూడు ఫార్మెట్లలో టీమిండియాకు కెప్టెన్గా ఎంపిక అవడం వరకు కోహ్లీ నిబద్ధతే కారణమని తెలిపాడు. సాధారణంగా కోహ్లీ ఏవైనా సరే తాజాగా ఉండేవి మాత్రమే ఉపయోగిస్తాడని, ఇంటికొచ్చినప్పుడు ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలను ఇస్తే వాటికి నో అని చెప్పి ఇంట్లో పండ్లు ఉంటే వాటిని జ్యూస్గా తీసి ఇవ్వమని కోరతాడని చెప్పాడు.
కోహ్లీకి కోచ్గా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతున్నా
కోహ్లీకి కోచ్గా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. అతి తక్కువ సమయంలో తనంతట తానుగా కోహ్లీ ఎంతగానో మార్చుకున్నాడని చెప్పాడు. యుక్త వయసులోనే కోహ్లీ ఇలాంటి త్యాగాలు చేస్తున్నాడని, ఈ వయసులో కూడా తాను మాత్రం త్యాగాలు చేయలేకపోతున్నానని అన్నాడు.
‘కోహ్లి జన్మతః కెప్టెన్. చిన్నప్పటి నుంచి అకాడమీలో కూడా కెప్టెన్గా ఉండేందుకు ఇష్టపడేవాడు. ఆ దశలోనే నాయకత్వ లక్షణాలు వచ్చాయి. టెస్టు సారథిగా ఎంపికైన తర్వాత అతని కెప్టెన్సీ, ప్రదర్శన మెరుగైందని' ఆయన అన్నారు.