న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనతో మిగతా మూడు వన్డేలకు వెస్టిండిస్ జట్టు ఎంపిక

స్వదేశంలో టీమిండియాతో జరిగే మిగతా మూడు వన్డేలకు వెస్టిండిస్ జట్టుని ఆ దేశ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరిస్‌లో వెనుకబడిన వెస్టిండిస్ ప్రయోగాలకు సిద్ధమవుతోంది.

By Nageshwara Rao

హైదరాబాద్: స్వదేశంలో టీమిండియాతో జరిగే మిగతా మూడు వన్డేలకు వెస్టిండిస్ జట్టుని ఆ దేశ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరిస్‌లో వెనుకబడిన వెస్టిండిస్ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మిగతా మూడు వన్డేల కోసం ఇద్దరు యువ ఆటగాళ్లు తుది జట్టులో చోటు కల్పించింది.

ప్రస్తుతం జట్టులో ఉన్న విలియమ్స్‌, జోనాథన్‌ కార్టర్‌ను తప్పించి వారి స్థానంలో సునీల్‌ అంబ్రిస్‌, కైల్‌ హోప్‌ చోటు కల్పించింది. 13మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ వెస్టిండీస్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ బ్రోనే వెల్లడించాడు. సునీల్‌, కైల్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ప్రదర్శన కనబరుస్తారని బ్రోనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Kyle Hope, Sunil Ambris earn maiden ODI call-ups

భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టు ఇప్పటికే 1-0తో వెనుకబడింది. జూన్‌ 30న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మిగతా మూడు వన్డేల కోసం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు 13మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.

వెస్టిండిస్ జట్టు: సునీల్‌ అంబ్రిస్‌, దేవేంద్ర బిషూ, రోస్టన్‌ ఛేజ్‌, మిగుల్‌ కమిన్స్‌, జాసన్‌ హోల్డర్‌(సారథి), కైల్‌ హోప్‌, జోసఫ్‌, ఎవిన్‌ లూయిస్‌, జాసన్‌ మహ్మద్‌, ఆష్లే నర్స్‌, కీరన్‌ పావెల్‌, రోవ్మెన్‌ పావెల్‌.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X