|
రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 44 పరుగులు
22.3వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని ఎదుర్కొన్న రెన్షా (44) కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 69 బంతులు ఎదుర్కొన్న రెన్ షా ఏడు ఫోర్ల సాయంతో 44 పరుగులు సాధించాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్ పరుగులను జత చేయగా రెన్ షా ప్రస్తుతం 523 పరుగులు చేశాడు.
|
పాకిస్థాన్పై టెస్టుల్లో అరంగేట్రం
గతేడాది నవంబర్లో పాకిస్థాన్పై పీటర్ హ్యాండ్స్ కోంబ్, నిక్ మాడిన్సన్లతో పాటు రెన్ షా కూడా అడిలైడ్ ఓవెల్ టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 137 బంతులను ఎదుర్కొన్న రెన్ షా 34 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
సిడ్నీలో తొలి టెస్టు సెంచరీ
ఆ తర్వాత జరిగిన మెల్ బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 71 పరుగులు నమోదు చేశాడు. అనంతరం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో జరిగిన టెస్టులో 184 పరుగులు చేసి తొలి టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.
|
రాంచీ టెస్టులో లంచ్ విరామానికి ఆసీస్ 109/3
23వ ఓవర్లో వికెట్ కోల్పోయిన ఆసీస్ వెంటనే 26వ ఓవర్లో మరో కీలక వికెట్ను కోల్పోయింది. 26వ ఓవర్లో అశ్విన్ వేసిన తొలి బంతి మార్ష్ బ్యాట్ను తాకి గాల్లోకి లేవడంతో పూజారా ఒంటిచేత్తో ఈ క్యాచ్ను అందుకున్నాడు. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీసేన రివ్యూని ఆశ్రయించింది. రివ్యూలో అశ్విన్ వేసిన బంతి బ్యాట్ని తాకినట్లు తేలడంతో మార్ష్ను ఔట్గా ప్రకటించారు.