అత్యధిక స్ట్రయిక్ రేటు
ఇంతక ముందు 52 మంది ఈ ఘనత సాధించినప్పటికీ వీరందరికంటే అత్యధిక స్ట్రయిక్ రేటుతో మ్యాక్స్వెల్ వెయ్యి పరుగులు పూర్తి చేయడం విశేషం. ఐపీఎల్లో ఇప్పటివరకు 45 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ 164.75 స్ట్రయిక్ రేటుతో 1005 పరుగులు సాధించాడు.
22 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్
సోమవారం హోల్కర్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ మ్యాక్స్వెల్ (22 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో మరో 33 బంతులు మిగులుండగానే పంజాబ్ నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది.
4110 పరుగులతో కోహ్లీ
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 4110 పరుగులతో ఐపీఎల్లో అందరికంటే ముందున్నాడు. సురేశ్ రైనా (4098), రోహిత్ శర్మ (3874), గౌతమ్ గంభీర్ (3847) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐదో స్థానంలో క్రిస్ గేల్
ఇక టీ20 విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 153.2 స్ట్రయిక్ రేటుతో 3464 పరుగులు సాధించాడు. గేల్తో పోలిస్తే మ్యాక్స్వెల్ స్ట్రయిక్ రేటు ఎక్కువ ఉండడం విశేషం. ఈ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పంజాబ్ విజయం సాధించగా.. మూడో మ్యాచ్ ఆడిన బెంగళూరుకు ఇది రెండో ఓటమి.