హైదరాబాద్: బీసీసీఐ భారత జట్టుకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అజహరుద్దీన్ ఒకరు. అయితే ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్కు పూర్తిగా దూరమయ్యారు. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో అజహరుద్దీన్ బ్యాటింగ్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అనే చెప్పొచ్చు.
తాజాగా అజహరుద్దీన్ ఈ తరం క్రికెటర్లకు 'అజార్-ది కెప్టెన్' అనే ఓ మొబైల్ గేమ్ ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని అజహరుద్దీన్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్టు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Pre Launch of Azhar -The Captain. A next generation mobile cricket game. Watch this space for more details soon ! pic.twitter.com/8HNPTltca7
— Mohammed Azharuddin (@azharflicks) 9 August 2017
భారత్ తరుపున 99 టెస్టులాడిన అజహరుద్దీన్ 6216 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక 334 వన్డేలాడి 9378 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 58 అర్ధసెంచరీలు ఉన్నాయి.