హైదరాబాద్: టీమిండియా కెప్టెన్గా మహేంద్ర్ సింగ్ ధోని నుంచి సారథ్య బాధ్యతలను స్వీకరించిన విరాట్ కోహ్లీ అదే స్ధాయిలో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో వరుసగా 19 టెస్టుల్లో టీమిండియాకు ఓటమన్నదే లేకుండా జట్టుని నడిపించాడు.
ట్విట్టర్ యుద్ధానికి తెర: ఎంత పని చేశావయ్యా సెహ్వాగ్!
అంతేకాదు కెప్టెన్గా జట్టు సహచరులకు విలువైన సూచనలు చేస్తూ, ఓ రోల్ మోడల్గా నిలిచాడు. అయితే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలవడంతో ధోని రికార్డుని ఎప్పటికీ కోహ్లీ అందుకోలేకుండా పోయాడు.
అదేంటంటే ధోని కెప్టెన్సీలో టీమిండియా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో ఆడిన ఏ టెస్టులో కూడా ఓడిపోలేదు. వరుసగా 8 టెస్టుల్లో ఆస్ట్రేలియాను ధోని నేతృత్వంలోని టీమిండియా ఓడించింది. 2008-09 సిరీస్లో నాలుగు టెస్ట్ల సిరీస్ను 2-0తో ధోనీ సేన గెలిచింది.
ఆ తర్వాత 2010-11లో కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం అయింది. చివరిసారిగా 2012/13లో ఆస్ట్రేలియాపై 4-0తో సిరిస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరిస్లో ఆస్ట్రేలియాపై ధోని డబుల్ సెంచరీని సాధించాడు. తాజా సిరిస్లో కోహ్లీసేన ఫేవరేట్గా బరిలోకి దిగింది.
అయితే పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. స్వదేశంలో టీమిండియా ఘోర పరాజయం పాలైన టెస్టుల్లో ఇదొకటి. ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ 12 వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 441 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 107 పరుగులకే ఆలౌటైంది.
కోహ్లీసేన పుంజుకుంటుంది: ఆసీస్ చేతిలో ఓటమిపై సచిన్
దీంతో పూణె టెస్టులో భారత జట్టుపై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2004 తర్వాత తొలిసారి భారత గడ్డపై ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ని గెలిచింది.