ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన వేటు పడింది. వన్డే, ట్వంటీ 20 కెప్టెన్సీకు గుడ్ బై చెప్పిన కొద్ది రోజుల్లోనే కెప్టెన్ కూల్గా ఎదురు దెబ్బ తగిలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10లో ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ పుణే సూపర్ జెయింట్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గత ఐపీఎల్లో ధోనీ నేతృత్వంలోని జట్టు పేలవ ప్రదర్శన చేసింది.
పుణే గత సీజన్లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభానికి ముందే ధోనీకి షాకిస్తూ.. అతని స్థానంలో సారథిగా స్టీవ్ స్మిత్ను నియమించారు.
గత ఐపీఎల్లో గుజరాత్ లయన్స్తో పాటు పుణే ఆరంగేట్రం చేశాయి. గుజరాత్ లయన్స్ మొదటి స్థానంలో నిలవగా, పుణే చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో 14 మ్యాచుల్లో కేవలం 5 మ్యాచుల్లో మాత్రమే పుణే గెలిచింది. ధోనీ ఆట తీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. 12 ఇన్నింగ్సుల్లో ఒకే అర్ధ సెంచరీతో 284 పరుగులు చేశాడు.