ముంబై: టీమిండియా, ఐపిఎల్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీరిక లేని షెడ్యూళ్లతో బిజీబిజీగా గడుపుతుంటాడు. టోర్నీ లేదంటే ఎండార్స్ మెంట్లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటాడు. ఇన్ని పనుల మధ్య ఖాళీ దొరకడమే కష్టం.. అలాంటిది ధోనీకి తీరిక చిక్కితే ఏం చేస్తాడంటే.. ఇంట్లోనే కుటుంబంతో సేదదీరుతాడు.
ఇంట్లో ముద్దుల కూతురు జివాతో గడపడం ధోనీకి అత్యంత ప్రధానమైన వ్యాపకం. కుమార్తెతో గడిపిన క్షణాలను గుండెల్లో భద్రపరచుకుంటాడు. తీరిక వేళలో ధోనీ కుమార్తెతో ఆడుకుంటాడని చెబుతూ, అతని భార్య సాక్షి ఇన్ స్టా గ్రాంలో కొన్ని ఫోటోలను పోస్టు చేసింది.
ఈ ఫోటోల్లో కుమార్తెను తన్మయత్వంతో చూసుకుంటున్న ధోనీ కనువిందు చేశాడు. కాగా, టోర్నీలో ప్రతి మ్యాచ్కు కూతురు జివా, భార్య సాక్షితో కలిసి వెళ్తున్నాడు.
తన చిట్టితల్లితో ప్రేమబంధాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు. విమానంలో జివాతో కలిసి ఆడుకుంటున్న ధోని చిత్రాల్ని ఆయన భార్య సాక్షిసింగ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ధోని ఆనందోల్లాసాన్ని మీరూ చూడండి.