హైదరాబాద్: టీమిండియా అభిమానులు ఇప్పటివరకు ఎంత మంది వికెట్ కీపర్లను చూసి ఉండొచ్చు గాక, కానీ మహేంద్ర సింగ్ ధోని స్టయిలే వేరు. తాజాగా పూణె వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ వికెట్ కీపింగ్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ పదో సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన వికెట్ కీపింగ్తో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ను
స్టంపౌట్ చేసి మురిపించిన ధోనీ.. తాజాగా ఓ రనౌట్తో మళ్లీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
బుధవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పూణె బౌలర్ సుందర్ వేసిన బంతిని కెప్టెన్ గౌతమ్ గంభీర్ పైన్లెగ్ దిశగా త రలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మరో ఓపెనర్ సునీల్ నరేన్ వేగంగా క్రీజులోకి వచ్చేందుకు ప్రయత్నించినా.. ధోని చేసిన మ్యాజిక్తో నరేన్ రనౌట్ అవక తప్పలేదు.
ఫైన్లెగ్ దిశగా వెళ్లిన బంతిని ఫీల్డర్ శర్ధూల్ ఠాకూర్ వేగంగా కీపర్ ధోనీకి చేతికి అందించగా.. వూహకందని రీతిలో ధోని వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. బంతి చేతికి రాకముందే రనౌట్కు సిద్ధమైన ధోని.. దానికి తగినట్లుగా ఫుట్వర్క్ని మార్చుకున్నట్లు రిప్లైలో కనిపిస్తోంది.
పూణె వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లాడిన కోల్కతాకు ఇది ఆరో విజయం.
కోల్కతా ఆటగాళ్లలో గంభీర్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, ఒక సిక్సు), రాబిన్ ఊతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సుల)తో అర్ధసెంచరీలు నమోదు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.