|
ధోని నెట్ ప్రాక్టీస్
రెండో వన్డేలో భాగంగా మంగళవారం ధోని నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. అనంతరం కోహ్లీ, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్తో కలిసి ఫుట్బాల్ ఆడాడు. ఈ మేరకు బీసీసీఐ ధోని నెట్ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోలను ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
|
బలమైన షాట్లు కొట్టిన ధోని
ప్రాక్టీస్లో భాగంగా ధోని బలమైన షాట్లు కొట్టాడు. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలో భాగంగా టీమిండియా మంగళవారం నెట్ ప్రాక్టీస్లో పాల్గొంది.
|
నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్న కెప్టెన్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు రెండో వన్డే కోసం మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే కటక్లో గురువారం జరగనుంది.
తొలి వన్డేలో ఇంగ్లాండ్పై నెగ్గిన టీమిండియా
మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఆదివారం (జనవరి 15)వ తేదీన పూణెలో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్పై మూడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 351 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కోహ్లీ, కేదార్ జాదవ్ సెంచరీలతో చెలరేగి ఆడటంతో ఇంగ్లాండ్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.