ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ కీపర్ ఎవరంటే అందరూ తడుముకోకుండా చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. కానీ ఐపీఎల్లో మాత్రం ధోనీ కంటే తాను చాలా బెస్ట్ అనిపించుకుంటున్నాడు దినేష్ కార్తీక్. దినేష్ కార్తీక్ ప్రస్తుతం గుజరాత్ లయన్స్కు ఆడుతున్నాడు.
గతంలో బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, ముంబై జట్లకు కూడా ఆడాడు. ఐపీఎల్ పోటీల్లో మొత్తం 97 మందిని ఔట్ చేయడం ద్వారా దినేష్ ముందు నిలిస్తే, ధోనీ 89 మందిని ఔట్ చేశాడు. 71 క్యాచ్లు, 26 స్టంపింగ్లతో దినేష్ ముందున్నాడు. ధోనీ 62 క్యాచ్లు, 27 స్టంపింగ్లతో ఉన్నాడు.
ఈ సీజన్ పరుగుల విషయంలోనూ కార్తీక్.. ధోనీని వెనక్కు నెట్టేశాడు. ఐపీఎల్లో ధోనీ 220 పరుగులు చేశాడు. కార్తీక్ 280 పరుగులు చేశాడు. ధోనీ ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేదు. కార్తీక్ మూడు హాఫ్ సెంచరీలు చేసాడు.