హోటల్ రెండో అంతస్తు నుంచి దూకాడు
కయిద్-ఇ-అజం ట్రోఫీలో భాగంగా యునైటెడ్ బ్యాంక్ ప్లేయర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్ అయిన యాసిమ్ ముర్తాజా అక్కడే బస చేస్తున్నారు. అయితే ప్రమాద సమాచారం తెలుసుకున్న బౌలర్ యాసిమ్ ముర్తాజా తప్పించుకునే యత్నంలో హోటల్ రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు.
చీలిమండకు గాయం
దాంతో అతని చీలిమండకు తీవ్రమైన గాయమైంది. యుబీఎల్ మేనేజర్ నదీమ్ ఖాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి ప్రమాదం లేదని క్షేమంగానే ఉన్నాడని తెలిపారు. మరొక క్రికెటర్ కరామాత్ అలీ చేతికి గాయపడినట్లు తెలిపారు.
ప్రమాదం నుంచి తప్పించుకున్న క్రికెటర్ షోయబ్ మస్జూద్
అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మస్జూద్ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా క్షేమంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. పోగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో వారికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రజలు ఆందోళన
మరోవైపు పాకిస్థాన్లో ఈ తరహా అగ్నిప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులను కరాచీలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు.