న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ వన్డే: పరువు కోసం ఇంగ్లాండ్, క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన కోహ్లీ

మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఆదివారం (జనవరి 22)న చివరిదైన మూడో వన్డే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఆదివారం (జనవరి 22)న చివరిదైన మూడో వన్డే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరోవైపు చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలనే యోచనలో ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. తొలి రెండు వన్డేల్లో 300కుపైగా స్కోరు నమోదు కావడంతో మూడో వన్డేలో కూడా భారీ స్కోరు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. చివరిసారిగా 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి.

భారీ స్కోరు నమోదు

భారీ స్కోరు నమోదు

ఈ మ్యాచ్‌లో టీమిండియా 404 పరుగులు చేసింది. ఆ వన్డేలో భారత్ 153 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రోహిత్ శర్మ 264 పరుగులతో డబుల్ సెంచరీ చేసింది ఈ మ్యాచ్‌లోనే. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

గతంలో రెండు వన్డేలు

గతంలో రెండు వన్డేలు

ఇక ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా 20 వన్డేలు ఆడగా, 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ గతంలో రెండు వన్డేలు జరిగాయి. ఆ రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడో వన్డేలో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

టీమిండయాను వేధిస్తున్న ఓపెనర్ల సమస్య

టీమిండయాను వేధిస్తున్న ఓపెనర్ల సమస్య

గతంలో ఇంగ్లాండ్‌పై ఆడిన రెండు వన్డేల్లోనూ టీమిండియా 270కు పైగా పరుగులు చేసి విజయం సాధించింది. ఇదిలా ఉంటే టీమిండియాను ఓపెనర్ల సమస్య వేధిస్తోంది. రెండు వన్డేల్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 8, 5 పరుగులు చేయగా, ధావన్ 1, 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరారు. అయితే ఓపెనర్లు విఫలమైనా జట్టులోని మిగతా ఆటగాళ్లు రాణించడంతో టీమిండియా 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

భారత్‌ జట్టు: విరాట్‌ కోహ్లి ( కెప్టెన్‌ ), ధోని(వికెట్ కీపర్‌), కెఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, కేదారి జాదవ్‌, యువరాజ్‌ సింగ్‌, అజింక్య రహానే, హ్యార్ధిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేష్‌ యాదవ్‌.

ఇంగ్లాండ్‌ జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌ ( కెప్టెన్‌ ), జానీ బెయిర్‌ స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, మొయిన్‌ ఆలీ, జో రూట్‌ , బట్లర్‌, లియామ్‌ డాసన్‌ , జాసన్‌ రారు, అదిల్‌ రషీద్‌, అలెక్స్‌ హేల్స్‌, జాక్‌ బాల్‌ , క్రిస్‌ వోక్స్‌, బెన్‌ స్టోక్స్‌, డేవిడ్‌ విల్లీ, ప్లంకెట్‌.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X