మొహాలి పిచ్ స్ఫిన్నర్లకు అనుకూలం
సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే మొహాలి పిచ్ను ఈసారి మాత్రం స్ఫిన్నర్లకు అనుకూలించేలా రూపొందించారనే వార్తలు వస్తున్నాయి. భారత జట్టులో విరాట్ కోహ్లీ, పుజారా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శనను కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
సాహా స్ధానంలో పార్ధీవ్ పటేల్
ఇదిలా ఉంటే మొహాలి టెస్టులో రెగ్యులర్ కీపర్ వర్ధమాన్ సాహా స్ధానంలో పార్ధీవ్ పటేల్ తుది జట్టులోకి రానున్నాడు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పార్ధీవ్ పటేల్ టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. ఈ టెస్టులో అతడు రాణించినా అతడికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పార్ధీవ్ పటేల్ని మూడో టెస్టు కోసమే ఎంపిక చేశారు కాబట్టి.
ఎలాంటి మార్పులు లేవు
ఈ ఒక్క మార్పు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండేలా కనిపించడం లేదు. మరోవైపు ఇంగ్లాండ్ సిరిస్ 1-0తో సిరిస్లో వెనుకబడి ఉంది. మొహాలి టెస్టులో ఎలాగైనా సరే విజయం సాధించి సిరిస్ను సమం చేయాలనే ఉద్దేశ్యంతో కుక్ సేన బరిలోకి దిగుతుంది.
అనూహ్యంగా పుంచుకున్న ఇంగ్లాండ్
2012లో జరిగిన సిరీస్లోనూ ఇలాగే 0-1తో వెనుకబడిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత అనూహ్యాంగా పుంజుకుని 2-1తో సిరిస్ను చేజిక్కించుకుంది. మొహాలి టెస్టులో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ నిలకడగా రాణించి పరుగుల వరద పారించాలని కోరుకుంటుంది. ఇక మిడిలార్డర్ మాత్రం స్టోక్స్, బెయిర్స్టో, మొయిన్ అలీలతో పటిష్టంగా ఉంది.
ఇంగ్లాండ్ జట్టులో మూడు మార్పులు
మొహాలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. డకెట్ స్థానంలో జోస్ బట్లర్, బ్రాడ్ స్థానంలో క్రిస్ వోక్స్ తుది జట్టులోకి రానున్నారు. ఇక అన్సారీని పక్కనపెట్టి గారెత్ బ్యాటీని తీసుకోవాలని ఇంగ్లాండ్ టీమ్ భావిస్తోంది.