ఓపెనర్లు విఫలం
కాగా, న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరిస్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానేలు ఇప్పటి వరకు మంచి భాగస్వామ్యాని నెలకొల్పలేదు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్లు గాయం కారణంగా ఈ సిరిస్కు దూరమవ్వడంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రహానే బరిలోకి దిగుతున్నారు. నాలుగో వన్డేలోనైనా భారత ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.
రాంచీలో టీమిండియాకు రికార్డు
ఇదిలా ఉంటే నాలుగో వన్డే జరగనున్న రాంచీలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు రాంచీలో టీమిండియా మూడు మ్యాచ్లు ఆడగా రెండింటిలో గెలిచింది. ఈ సిరిస్లో ఎంతో కీలకం కానున్న రాంచీ మ్యాచ్ ధోనిసేనకు కలిసొచ్చేలాగా ఉంది. అంతేకాదు రాంచీలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది.
తొలి వన్డే
జనవరి 19, 2013లో భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీలో తొలి మ్యాచ్ జరిగింది. ధోని నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. తొలుత జడేజా (3/19), ఇషాంత్ (2/29), అశ్విన్ (2/37) వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ (77 నాటౌట్) చెలరేగడంతో భారత్ 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
రెండో వన్డేకి వర్షం అడ్డంకి
ఇక అక్టోబర్ 23, 2013లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్కి వర్షం అడ్డింకిగా మారింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ జార్జ్ బెయిలీ (98), మాక్స్వెల్ (92) అర్ధ సెంచరీలతో రాణించారు. 296 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4.1 ఓవర్లలో 27/0 పరుగులు చేయగా వర్షం అడ్డంకిగా మారింది. దీంతో అంఫైర్లు మ్యాచ్ను రద్దు చేశారు.
మూడో వన్డే:
నవంబర్ 16, 2014లో కోహ్లీ నేతృత్వంలోని భారత్ 3 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరిస్ను ఈ మ్యాచ్తో క్లీన్స్వీప్ చేసింది. లంక 286/8 స్కోరు చేయగా.. కెప్టెన్ కోహ్లీ (139) సెంచరీతో రాణించడంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.