విశాఖపట్నం: వన్డే సిరిస్ విజేత ఎవరో తేల్చే ఐదో వన్డే మ్యాచ్కి భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శనివారం డేనైట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లు గెలిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిదీంతో ఐదో వన్డేపైనే సిరీస్ ఫలితం ఆధారపడింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత్లో జరుగుతున్న వన్డే సిరిస్ కావడంతో టీమిండియా ఎలాగైనా ఈ సిరిస్ను దక్కించుకోవాలని భావిస్తోంది. చివరి వన్డే కీలకం కావడంతో జట్లలో కూడా పలు మార్పులు చేసే అవకాశం ఉంది.
భారత జట్టులో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. నాలుగో వన్డేలో విశ్రాంతి తీసుకున్న బుమ్రాని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇటీవలే టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది.
ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు జరగ్గా, నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్లోనే ఓటమిపాలైంది. 2005లో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్పై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత 2007లో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక 2010 ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 2011లో వెస్టిండిస్పై ఐదు వికెట్లతో విజయం నమోదు చేసింది. కాగా, 2013లో నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. కాగా, 2014లో అక్టోబర్లో వెస్టిండిస్తో జరగాల్సిన వన్డే మ్యాచ్ తుపాను కారణంగా రద్దైంది.
విశాఖ వన్డేకు తప్పిన ముప్పు: యధావిధిగా మ్యాచ్ మరోవైపు వైజాగ్ స్డేడియంలో కెప్టెన్ ధోనికి మంచి రికార్డు ఉంది. 2005లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోని 148 పరుగులు నమోదు చేశాడు. ఇప్పటివరకూ ఈ స్టేడియంలో ఇదే ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాదు ఈ స్టేడియంలో అత్యధిక భాగస్వామ్యాన్ని భారత్ జోడినే నమోదు చేసింది.
2011లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ-రోహిత్ల జోడి నాలుగో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇదే ఇక్కడ ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం. మరోవైపు ఐదో వన్డేలో గెలిచి సిరిస్ దక్కించుకోవాలన్న న్యూజిలాండ్ చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తోంది.
టెస్టుల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనలో కూడా న్యూజిలాండ్ జట్టు ఉంది. తొలి రెండు వన్డేల్లో పేలవమైన ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు కూడా ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.