హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో నిలబడాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు చెలరేగిపోయింది. దీంతో బుధవారం జేఎస్సీఏ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన 261 పరుగుల లక్ష్యాన్ని కాపాడు కోవడంలో న్యూజిలాండ్ బౌలర్లు సక్సెస్ అయ్యారు.
టీమిండియా బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీసి 48.4 ఓవర్లకే 241 పరుగులకే ఆలౌట్ చేసి 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం చేసింది. దీంతో వన్డే సిరిస్ విజేత ఎవరో చివరి ఐదో వన్డే ఈనెల 29న విశాఖపట్నంలో జరగనుంది.
4వ వన్డే: మిశ్రా ఆ క్యాచ్ పట్టి ఉంటే, ఫలితం మరోలా ఉండేది
అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య విశాఖపట్నం వేదికగా జరగనున్న వన్డేపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఐదో వన్డేకు ఆతిథ్యమిస్తున్న విశాఖపట్నంలో శనివారం తుఫాన్ ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుఫాను విశాఖకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది.
ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు ప్రయాణిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు 'కయాంత్' తుఫాను విశాఖపట్నాన్ని ఎప్పుడైనా తాకొచ్చని చెబుతున్నారు.
మళ్లీ ధోని మ్యాజిక్ చేశాడు: ఆ రనౌట్ నాలుగో వన్డేకే హైలెట్
తుపాను ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, ఈ రాత్రికి పోర్టు బ్లెయిర్ తీరానికి ఉత్తర వాయవ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖ తీరానికి తూర్పు దిశలో 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అంటే 27 లేదా 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావం ఐదో వన్డే జరగనున్న విశాఖపట్నంకు అతి సమీపంలో కేంద్రీకృతమై ఉండటంతో ఐదో వన్డే జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదో వన్డే గనుక జరగకపోతే వన్డే సిరిస్ 2-2తో సమం అవుతుంది. ఇదే గనుక జరిగితే భారత్లో వన్డే సిరిస్ గెలవాలన్న న్యూజిలాండ్ కోరిక కలగానే మిగిలిపోతుంది.