దిండిగల్ (తమిళనాడు): తమిళనాడు, పంజాబ్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచులో మంగళవారం ఆస్ట్రేలియాకు చందిన అంపైర్ జాన్ వార్డు తలకు గాయమైంది. ఆటలో అంపైరింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు.
పంజాబ్ బ్యాట్స్మన్ రజ్వీందర్ సింగ్ కొట్టిన బంతి వార్డ్ తలకు తగిలింది. బంతి తగిలిన వెంటనే అంపైర్ స్పృప తప్పి పడిపోయాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
తమిళనాడు, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో వార్డ్ మెయిన్ అంపైర్గా ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చంద్రశేఖర్ వేసిన బంతిని రజ్వీందర్ సింగ్ బలంగా బాదాడు. అది నేరుగా వార్డ్ తలకు తాకింది.