ఇద్దరు ఆటగాళ్లు కీలకమే
ఇద్దరు ఆటగాళ్లు కూడా బెంగాల్ జట్టు తరుపున రంజీ మ్యాచ్ల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై బెంగాల్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారి, కోచ్ సాయిరాజ్ బహుతులే, మేనేజర్ ఆటగాళ్లిద్దరితో మాట్లాడి మరోసారి ఇలాంటి చేష్టలకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు.
‘అవుట్ సైడర్' అని ఓజాను ఎగతాళి చేసిన దిండా
అని దిండా ఎగతాళి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఇలాంటివి మంచిది కాదని సూచించారు.
గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవ
గత ఐదు సీజన్లుగా దిండా రంజీల్లో బెంగాల్ జట్టు తరుపున ఫేస్ బౌలర్గా కొనసాగుతున్నాడు. గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవకు దిగిన సంఘటనలున్నాయి. 2008లో రంజీ మ్యాచ్లో భాగంగా బెంగాల్ జట్టు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆడుతున్న సమయంలో శిబ్ శంకర్ పాల్తో ఇదే విధంగా వ్యవహారించాడు.
విజయ్ హాజరే ట్రోఫీలో రనదీప్ బోస్ Vs దిండా
ఇక 2009లో అగర్తలలో జరిగిన విజయ్ హాజరే ట్రోఫీలో సీనియర్ మోస్ట్ బౌలర్ రనదీప్ బోస్, దిండా ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. అయితే అప్పటి కెప్టెన్ లక్ష్మీ రతన్ శుక్లాతో పాటు వైస్ కెప్టెన్ మనోజ్ తివారి కలగజేసుకుని సర్ది చెప్పడంతో ఆ గొడవ అప్పట్లో సర్దుమణిగింది.