హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫిబ్రవరి 9న జరగనున్న ఏకైక టెస్టులో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
250 వికెట్లు: డెన్నిస్ లిల్లీ రికార్డుని అశ్విన్ అధిగమిస్తాడా?
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. గతంలో డెన్నిస్ లిల్లీ(48 టెస్టులు) పేరిట ఉన్న రికార్డును అశ్విన్ కేవలం 45 టెస్టుల్లోనే అందుకున్నాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసుకున్న బౌలర్గా డెన్నిస్ లిల్లీ పేరిట రికార్డు ఉంది. 48 టెస్టుల్లో లిల్లీ ఈ రికార్డుని నెలకొల్పాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డుని అశ్విన్ అధిగమించాడు. 2011లో వెస్టిండిస్పై రవిచంద్రన్ అశ్విన్ టెస్టు అరంగ్రేటం చేశాడు.
బంగ్లాదేశ్తో ప్రస్తుతం అశ్విన్ ఆడుతున్న టెస్టు మ్యాచ్ 45 టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అశ్విన్ ఇప్పటి వరకు 24 సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో అశ్విన్ 28 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో జరగనున్న ఏకైక టెస్టులో కూడా టీమిండియా అదే జోరుని కొనసాగిస్తుంది.
ఇదిలా ఉంటే టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయి చేరుకున్న 18వ బౌలర్ అశ్విన్గా నిలిచాడు. భారత్ తరఫున 250, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో బౌలర్ అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు బిషన్సింగ్ బేడి, కపిల్దేవ్, జహీర్, కుంబ్లే, హర్భజన్లు భారత్ తరుపున 250 వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్నారు.