న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాన్ ఆఫ్ ద సిరిస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రెండూ జడేజాకే

ఈ సిరిస్‌లో మొత్తం 25 వికెట్లు తీసిన జడేజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం వెనుక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడినా తిరిగి పుంజుకుని సిరీస్‌ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు.

ఓడాక కలిసి డిన్నర్ చేద్దాం: వేడ్ కవ్వింపుపై జడేజా (ఫోటోలు)ఓడాక కలిసి డిన్నర్ చేద్దాం: వేడ్ కవ్వింపుపై జడేజా (ఫోటోలు)

ఈ సిరిస్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయడంలో విఫలమైనతే జడేజా మాత్రం ఆసీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఈ సిరిస్‌లో మొత్తం 25 వికెట్లు తీసిన జడేజా 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు అందుకున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు.

 Ravindra Jadeja man of the series India win the test series 2-1 vs Australia

ఇక పూణె టెస్టులో ఐదు వికెట్లు, బెంగళూరులో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక డ్రాగా ముగిసిన రాంచీ టెస్టులో జడేజా 9 వికెట్లు తీసి తన విశ్వరూపం ప్రదర్శించాడు.

ధర్మశాల టెస్టులో భారత్ విజయం: 2-1తో టెస్టు సిరిస్ కైవసంధర్మశాల టెస్టులో భారత్ విజయం: 2-1తో టెస్టు సిరిస్ కైవసం

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X