నిద్రమత్తులో ఉన్నా
నిద్రమత్తులో ఉన్న తాను అలానే ఐపీఎల్ బిడ్డింగ్ని వీక్షించినట్లు చెప్పుకొచ్చాడు. 'జింబాబ్వే సిరీస్లో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకలేదు. ఆ క్రమంలోనే నేను సోమవారం నిద్రమత్తులో ఉన్నా. ఐపీఎల్ వేలం జరుగుతుందనే విషయం తెలుసు. కానీ బాగా అలసటగా ఉండి అలానే పడుకున్నా' అని రషీద్ చెప్పాడు.
కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు
'అయితే నా పేరు బిడ్డింగ్లో వచ్చిన విషయాన్ని నా తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పారు. దాంతో నేను హడావుడిగా లేచి నిద్రమత్తులోనే టీవీ వీక్షించా. నన్ను నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యా. నా జీవితంలో ఐపీఎల్ చాలా సంతోషాన్ని తీసుకొచ్చింది' అని రషీద్ అన్నాడు.
4 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
సోమవారం బెంగుళూరులో జరిగిన వేలంలో 18 ఏళ్ల రషీద్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 10వ ఎడిషన్లో ఆప్ఘనిస్థాన్కు చెందిన ఐదుగురు ఆటగాళ్లు వేలం బరిలో నిలిస్తే, అందులో ఇద్దరు ఆటగాళ్లను మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్ రైజర్స్
ఈ ఇద్దరు ఆటగాళ్లను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. తొలుత మొహ్మద్ నబీని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ, ఆ తర్వాత లెగ్ స్ఫిన్నర్ రషీద్ ఖాన్ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో నబీ ఆల్ రౌండర్గా రాణిస్తున్నాడు.
తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా నబీ గుర్తింపు
ఐపీఎల్ వేలంలో నబీని సన్ రైజర్స్ తొలుత కొనుగోలు చేయడం ద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్న తొలి ఆఫ్ఘాన్ ప్లేయర్గా నబీ గుర్తింపు పొందాడు. కుడి చేత వాటం ఆటగాడైన నబీ, ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఆఫ్ఘానిస్థాన్ తరపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా, 73 వికెట్లు తీశాడు.