న్యూఢిల్లీ: క్రికెటర్లు తమకు నచ్చిన సంఖ్యనే తమ టీ షర్ట్స్(జెర్సీలపై) ముద్రించుకుంటారు. అదే నెంబర్ను ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటారు. టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 7ను ఎంచుకున్నాడు. ఎందుకంటే జూలై 7న మహేంద్ర సింగ్ ధోనీ జన్మించాడు.
కాగా, భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన జెర్సీపై 18 అనే సంఖ్యను ఎంపిక చేసుకున్నాడు. అండర్-19 జట్టుకు ఆడిప్పటి నుంచి కూడా కోహ్లీ అదే నెంబర్ను కొనసాగిస్తున్నాడు.
ప్రముఖ వెబ్సైట్స్ క్రిక్ట్రాకర్, బియింగ్ ఇండియన్ ప్రకారం.. ఈ ఢిల్లీ ఆటగాడికి సంబంధించి అది ఒక భావోద్వేగ సంఖ్య. 2006, డిసెంబర్ 18న కోహ్లీ తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి 18 అనే సంఖ్యనే తన జెర్సీపై పెట్టుకున్నాడు కోహ్లీ.
ధోనీ, కోహ్లీలే గాక, అజింక్యా రహానే, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలోపాటు చాలా మంది ఆటగాళ్లు తమ జెర్సీల నెంబర్ల వెనక ఏదో ఒక స్టోరీ ఉండటం గమనార్హం.